ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. ఈ రోజు నుంచి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు మహేష్ బాబు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది మహేష్ బాబుకి 25వ చిత్రం.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో ఓ కుర్ర హీరో మహేష్ బాబుతో తెర పంచుకోబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఆ హీరో ఎవరో కాదు. అల్లరి నరేష్. డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో మహేష్ బాబు ఈ మల్టీస్టారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మహేష్ బాబు, అల్లరి నరేష్ పాత్రలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. మహేష్ బాబు మల్టీస్టారర్ చేయడం కొత్తేం కాదు. ఆల్ రెడీ వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చేసాడు మహేష్ బాబు. ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్ సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.