మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం చేజారితే ఆ హీరోయిన్ ఎంత బాధ పడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య అలాంటి బాధ అప్ కమింగ్ హీరోయిన్ అనుపమపరమేశ్వరన్ అనుభవించింది. అయితే తాజాగా అమ్మడికి మంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
అక్కినేని హీరో అఖిల్ హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఈ ఇద్దరు హీరోయిన్లు ఫైనలైజ్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనుపమపరమేశ్వరన్, మోహర్రీన్ లను కథానాయికలుగా తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ సినిమాలో నటించే అవకాశం పోగొట్టుకుని అనుపమపరమేశ్వరన్ తెగ నిరాశపడిపోయింది. కానీ ఆ వెంటనే అఖిల్ సినిమాలో నటించే అవకాశం రావడంపట్ల అనుపమ హ్యాపీగా ఉందట. మరి ఈ ఆఫర్ అయినా అనుపమ చేజారకుండా ఉండాలని కోరుకుందాం.