'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి 'నట విశ్వరూప' టైటిల్ ని పరిశీలిస్తున్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు చాలా టైటిల్స్ ప్రచారంలోకి వస్తాయి. అలాంటి ప్రచారంలో భాగంగానే ఈ టైటిల్ కూడా తెరపైకి వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్తలు ఉన్నాయి. కాబట్టి ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఆ ముగ్గురు హీరోయిన్లను ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్, అనుపమా పరమేశ్వరన్, మంజిమా మోహన్ లను హీరోయిన్లుగా ఫిక్స్ చేసారట. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలే కాకుండా ఐటమ్ పాటను మరో హీరోయిన్ తో చేయించబోతున్నారని సమాచారమ్. జనవరి నెలాఖరులో ఈ చిత్రం పూజా కార్యక్రమలను జరిపి ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట.