స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత మహేష్ బాబుతో ఈ డైరెక్టర్ చేయబోయే రెండో సినిమా ఇది. ఎన్టీఆర్ తో 'జనతాగ్యారేజ్' అంటూ ఓ భారీ సక్సెస్ ఫుల్ సినిమాని చేసాడు. ప్రభాస్ తో 'మిర్చి' చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ. కానీ ఎందుకనో మెగా హీరోలతో ఈ డైరెక్టర్ కి కుదరడంలేదు. రాంచరణ్, అల్లు అర్జున్ తో సినిమాలు చేసేస్తాడని అనుకునేలోపు ఆ ప్రాజెక్ట్ప్ క్యాన్సిల్ అయ్యాయి. ఇందుకు కారణం కథలు కుదరకపోవడమే.
కాగా తాజా వార్తల ప్రకారం మెగా హీరోలతో సినిమాలు చేయాలని కొరటాల శివ గట్టిగా ఫిక్స్ అయ్యారట. ఓ వైపు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం సన్నాహాలు చేసుకుంటూనే పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ కోసం కథలు రాసుకుంటున్నాడట. మహేష్ బాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లిన తర్వాత, ఆ సినిమా సగం షూటింగ్ పూర్తవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ లను కలిసి కథలు చెప్పాలనుకుంటున్నాడట కొరటాల. ఎలాగైనా ఈ హీరోల్లో ఎవరో ఒకరిని పట్టేసి, మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చేయాలనుకుంటున్నాడట. మరి పవన్, రాంచరణ్, అల్లు అర్జున్ లో ఎవరు కొరటాలకు పడతారో వేచి చూద్దాం. అన్ని కుదిరితే కొరటాల తదుపరి హీరో మెగా కాంపౌండ్ హీరోనే అవుతాడని ఫిల్మ్ నగర్ టాక్.