యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ బాక్సర్లుగా అలరించనున్నారని సమాచారమ్.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి ఓ హీరోయిన్ ఖరారయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తోంది అనుఇమ్మాన్యువేల్. స్టైలిష్ స్టార్ అ్లు అర్జున్ సరసన 'నా పేరు సూర్య' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించిందనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అనుఇమ్మాన్యువేల్ ని హీరోయిన్ గా తీసుకున్నారనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు. అనుఇమ్మాన్యువేల్ కమిట్ అయిన సినిమాలు ఆమెను మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ల జాబితాలోకి చేర్చాయి. ఇక రాజమౌళి సినిమాలో హీరోయిన్ అంటే ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం ఖాయం. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.