9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి గ్రాండ్ వెల్ కమ్ దక్కడంతో ఫుల్ జోష్ మీదున్నారు. దాంతో పెద్ద గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారట చిరు. అందులో భాగంగా ఆల్ రెడీ 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా స్వాతంత్ర సమరయోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవితాన్ని ఆధారంగా తీసుకుని తయారు చేసిన స్టోరీ లైన్ తో సినిమా చేయబోతున్నారు చిరంజీవి.
దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా 152 వ చిత్రం చేయాలని చిరు ఫిక్సయ్యారట. 153, 154 చిత్రాలను నిర్మించే అవకాశం బయట నిర్మాతలకు ఇచ్చారని తెలుస్తోంది. చిరుతో హిట్ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ 153 వ చిత్రాన్ని, మరో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ 154వ చిత్రాన్ని నిర్మించే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ చిత్రాలకు దర్శకులుగా క్రిష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఆల్ రెడీ క్రిష్ ఈ మధ్య చిరుని కలిసి ఓ కథ చెప్పాడు. త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ లు చిరు కోసం కథలు తయారు చేయడానికి రెడీగా ఉన్నారట. మొత్తం మీద చిరు వరుసగా సినిమాలు చేయడానికి సమాయత్తమవుతున్నారని దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. మెగాభిమానులకు ఇంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉంటుందా...!