టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజా వార్తల ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం రకుల్ ని కాంటాక్ట్ చేసారట. అయితే రకుల్ ఈ సినిమా అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
పవన్ కళ్యాణ్ హీరోగా నేసన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇది తమిళ్ చిత్రం 'వేదాళం' కి రీమేక్. ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారట. కానీ ఈ సినిమాకి బల్క్ డేట్స్ ఇవ్వడానికి నయనతార నో చెప్పడంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే రకుల్ కూడా బల్క్ డేట్స్ కేటాయించడానికి సిద్ధంగాలేదట. అందుకే ఈ సినిమాకి నో చెప్పిందని సమాచారమ్. దర్శక, నిర్మాతలు, పవన్ కళ్యాణ్ చర్చించుకుని బల్క్ డేట్స్ అడగకుండా, రకుల్ డేట్స్ ప్రకారం షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటే రకుల్ ఖచ్చితంగా ఈ సినిమా అవకాశం వదులుకోదు. మరి రకుల్ కోసం షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో ప్లానింగ్ మార్చుకుంటారా... మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెడతారా వేచి చూద్దాం.