నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ వర్కవుట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ ని సెట్ చేయడానికి ప్రయత్నిస్తోన్న డైరెక్టర్ ఎవరో కాదు... ఎ.యస్.రవికుమార్ చౌదరి. 'సౌఖ్యం' చిత్రంతో ఘోర పరాజయాన్ని చవిచూసిన రవికుమార్ చౌదరి ఈసారి ఓ మాంచి స్ర్కిఫ్ట్ ని వర్కవుట్ చేసాడట. ఈ స్ర్కిఫ్ట్ నిర్మాత కె.యస్.రామరావుకి వినిపించాడట. ఆయనకు కథ నచ్చడంతో హీరోలను వర్కవుట్ చేసే పనిమీద పడ్డాడు రవికుమార్ చౌదరి.
ముందుగా నందమూరి కళ్యాణ్ రామ్ కి స్ర్కిఫ్ట్ వినిపించాడట రవికుమార్ చౌదరి. స్ర్కిఫ్ట్ విన్న కళ్యాణ్ రామ్ ఏ నిర్ణయం చెప్పలేదటగానీ, సానుకూలంగానే స్పందించాడని సమాచారమ్. ఇక సాయిధమ్ తేజ్ కి 'పిల్లానువ్వులేని జీవితం' తో మంచి విజయాన్ని అందించాడు రవికుమార్ చౌదరి. కాబట్టి సాయిధరమ్ తేజ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మల్టీస్టారర్ కి 'రామకృష్ణ' టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ ని ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ కూడా చేసారట. రామగా కళ్యాణ్ రామ్, కృష్ణగా సాయిధరమ్ తేజ్ అలరించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడని సమాచారమ్. అన్ని కుదిరితే డిసెంబర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.