మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని నిర్మించేసి రాంచరణ్ కామ్ గా ఉండిపోతాడనుకుంటే పొరపాటే. నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై వరుసగా సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయ్యాడట రాంచరణ్.
ఇందుకోసం పక్కా ప్లానింగ్ జరుగుతోందట. శర్వానంద్, అఖిల్ అక్కినేనిలతో రాంచరణ్ సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారమ్. ఈ హీరోల కోసం కధలు కూడా వింటున్నాడట రాంచరణ్. 'ఖైదీ నెం.150' చిత్రం విడుదల తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే రాంచరణ్ తన బ్యానర్ పై సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడట. మరి ఈ బ్యానర్ లో శర్వానంద్, అఖిల్ సినిమాలకు దర్శకత్వం వహించబోయే దర్శకులెవరు తదితర విషయాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద రాంచరణ్ నిర్మాతగా ఎదగడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడని ఊహించవచ్చు.