మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ఎప్పుడు ఆరంభమవుతుందనే విషయంలో క్లారటీ రాలేదుగానీ, ఓ షాకింగ్ న్యూస్ మాత్రం పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. 'సైరా' ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిరుకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి ''వే ఆఫ్ మేకింగ్'' అంతగా నచ్చలేదట. ఆయన చాలా డిస్పాయింట్ అయ్యారని సమాచారమ్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేయగలుగుతాడా అనే అనుమానం చిరుకి కలిగినట్టు తెలుస్తోంది. దీని పర్యవసానం డైరెక్టర్ మార్పు గురించి చర్చ జరిగినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
చిరు 'చూడాలని ఉంది' సినిమాకి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. పైగా 'రుద్రమదేవి' లాంటి భారీ బడ్జెట్, హిస్టారికల్ చిత్రాన్ని గుణశేఖర్ చాలా బాగా హ్యాండిల్ చేసాడు. ఇవన్ని పరిగణనలోకి తీసుకుని గుణశేఖర్ ని డైరెక్షన్ సూపర్ వైజర్ గా తీసుకోవాలనే ఆలోచన చిరుకి ఉందని సమాచారమ్. మరోవైపు డైరెక్టర్ ని మార్చి, టోటల్ గా గుణశేఖర్ ని తీసుకుంటే ఎలా ఉంటుందాని కూడా ఆలోచిస్తున్నారట. కానీ ఆల్ రెడీ ఈ చిత్రం కోసం ఎంపిక చేసిన సాంకేతిక వర్గంలో మార్పులు జరిగాయి. కెమెరామ్యాన్ రవివర్మన్ ని తీసుకున్నారు. ఆయన తప్పుకుంటే రత్నవేల్ ని కెమెరామ్యాన్ గా తీసుకున్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్.రహమాన్ ని తీసుకుంటే, ఆయన కూడా ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోతున్నానని తప్పుకున్నాడు. ఇలా ఆల్ రెడీ ఇద్దరు ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు కాబట్టి, ఇప్పుడు డైరెక్టర్ విషయంలో మార్పు జరిగితే బాగుండదనే చర్చ జరుగుతోందట. ఈ వార్తలే కనుక నిజమైతే, మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ చర్చించుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ వార్తలు ఎంతవరకూ నిజం... కేవలం వదంతులేనా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.