యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ఈ హీరోలిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తారనే విషయాన్ని టాలీవుడ్ ఆడియన్స్ ఓ సంబరంలా ఫీలవుతోంటే, ఈ ఇద్దరితో పాటు మరో స్టార్ హీరోని ఈ సినిమాలో గెస్ట్ అఫియరెన్స్ ఇప్పించడానికి రాజమౌళి ట్రై చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.
#RRR లో ఓ స్పెషల్ అఫియరెన్స్ రోల్ ఉందట. ఈ పాత్రను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయించాలని భావిస్తున్న రాజమౌళి ఆల్ రెడీ ప్రభాస్ తో చర్చలు జరిపాడట. రాజమౌళి అడిగితే ప్రభాస్ కాదంటాడా... గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇది పవర్ ఫుల్ గెస్ట్ అఫియరెన్స్ అట. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందోకానీ... నిజంగానే ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్ స్ర్కీన్ షేర్ చేసుకుంటే అంతకంటే బిగ్ సర్ ప్రైజ్ మరొకటి ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే బాక్సాఫీస్ రికార్డులను ఈ సినిమా తిరిగిరాస్తుందని కూడా చెప్పొచ్చు.