ఫస్ట్ సినిమా 'ఉప్పెన' తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న మెగా మేనల్లుడు ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్నఈ చిత్రానికి టైటిల్ ని ఖరారు చేసారు. 'రంగ రంగ వైభవంగా' టైటిల్ టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్గా నటించింది. ఇక ఈ రోజు (24.1.2022) విడుదలైన టీజర్ ని గమనిస్తే...
యూత్ని మెప్పించేలా ఉంది టీజర్. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్ను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రానికి శామ్ దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.