ఆ ఫైట్ లో పాల్గొంటూ గాయపడిన హీరో... బైక్ సీక్వెన్స్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడిన హీరో... భారీ ఫైట్ చిత్రీకరణలో హీరోకి గాయలు... ఇలా వార్తలు వింటూనే ఉంటాం. ఇవన్ని హీరోకు సంబంధించిన వార్తలు. అయితే ఇందుకు భిన్నంగా తాజాగా ప్రముఖ కథానాయిక రాయ్లక్ష్మీ ఇదే విధంగా ఫైట్స్ చిత్రీకరణలో పాల్గొని స్వల్ప గాయాలతో బయటపడి, తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...
రాయ్లక్ష్మీ ప్రధాన పాత్రలో తెలుగులో ఓ వైవిధ్యమైన చిత్రం రూపొందుతుంది. రోచిశ్రీ మూవీస్ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ షూటింగ్లో రాయ్లక్ష్మీ, విలన్లు ప్రదీప్రావత్, సీనియర్ నటుడు సురేష్, ఇతర 18 మంది ఫైటర్స్తో అండర్వాటర్ లో భారీగా చిత్రీకరిస్తున్న యాక్షన్ సీక్వెన్సీలో లక్ష్మీరాయ్కి కాలుకి గాయమైంది. ప్రముఖ హాస్పటల్లో చికిత్స పొందిన అనంతరం ఆమె క్షేమంగా, పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లుగా త్వరలోనే ఆమె చిత్రీకరణలో కూడా పాల్గొంటుందని చిత్రబృందం తెలిపింది.