విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు . విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది .
ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ ... కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ పాత్ర ఆకట్టుకుంటుంది.
నిర్మాత మధు మాట్లాడుతూ ... ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు . ప్రసాద్ లాబ్స్ , రామానాయుడు స్టూడియోల్లో నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదలయ్యేంత వరకే చిన్న సినిమా , విజయం సాధించి పెద్ద సినిమా అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్, ఫిదా ఫేమ్ శరణ్య, సుమన్, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ, కాసర్ల శ్యామ్, కెమెరా సుభాష్ దొంతి, ఆర్ట్ నాగు, కొరియోగ్రఫీ రాజకిరణ్, చార్లీ .