మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నాడు. 'ధృవ' చిత్రం రిజల్ట్ రాంచరణ్ ని ఫుల్ ఖుషీ చేస్తే, నిర్మాతగా తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ చిత్రం 'ఖైదీ నెం.150' నిర్మించే పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకుని సక్సెస్ అయ్యాడు. ఇక తన తదుపరి సినిమాతో బిజీ అయిపోవాలనుకుంటున్సునాడట. కుమార్ దర్శకత్వంలోనే రాంచరణ్ఈ తదుపరి సినిమా రూపొందనుంది. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. జనవరి 30న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపి, వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే...
రాంచరణ్ తో సుకుమార్ చేయబోయే చిత్రం 75కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫేస్ బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 PM' టైటిల్ ని పరిశీలిస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. కథకు ఈ టైటిల్ అయితే యాఫ్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్స్ కూడా కన్ ఫార్మ్ అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఓ హీరోయిన్ గా రాశిఖన్నా, మరో హీరోయిన్ గా అనుపమాపరమేశ్వరన్ ని తీసుకున్నారని సమాచారమ్. ఈ ఇద్దరూ ఫస్ట్ టైమ్ రాంచరణ్ తో రొమాన్స్ చేయబోతున్నారు. మరి వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.