మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడని అందరూ భావించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'అదుర్స్' కి సీక్వెల్ తెరకెక్కుతుందనుకున్పారు. కానీ ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు.
తాజా వార్తల ప్రకారం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో వి.వి.వినాయక్ ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఆల్ రెడీ సాయిధరమ్ తేజ్, వినాయక్ ల మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు కూడా జరిగిపోయాయట. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారమ్. వినాయక్ సినిమాతో సాయిధరమ్ తేజ్ రేంజ్ ఇంకా పెరిగిపోతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'విన్నర్' టైటిల్ తో సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్.