మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను కురిపిస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ చిరులో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. పెద్ద గ్యాప్ తీసుకోకుండా తదుపరి సినిమా చేయడానికి చిరు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
'ధృవ' చిత్రం జరుగుతున్న సమయంలోనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ స్టోరీ లైన్ ని చిరుకి వినిపించాడట. ఆ స్టోరీ లైన్ చిరుకి నచ్చిందట. ఆ స్టోరీని డెవలప్ చేయమని కూడా చెప్పారట చిరు. ఈ మధ్య డెవలప్ చేసిన స్టోరీ లైన్ ని చిరుకి చెప్పాడట సురేందర్ రెడ్డి. స్టోరీని డెవలప్ చేసిన విధానం చిరుని ఫుల్లుగా ఇంప్రెస్ చేసిందట. దాంతో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట చిరు. మార్చిలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టేయాలని ఫిక్స్ అయ్యారట చిరు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గానే ఈ చిత్రం కూడా ఉండబోతోందట. దీని తర్వాత కూడా మరో కమర్షియల్ చిత్రం చేసి, ఆ తర్వాత 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' లాంటి భారీ కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నారట. సో... త్వరలోనే చిరు 151వ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని ఊహించవచ్చు.