మాస్ మహరాజ్ రవితేజ 'బెంగాల్ టైగర్' చిత్రం తర్వాత సినిమా చేయలేదు. ప్రస్తుతం రవితేజ తదుపరి చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. రైటర్ విక్రమ్ సిరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి హీరోయిన్ కూడా కన్ ఫార్మ్ అయ్యింది. రవితేజతో ఆల్రెడీ జతకట్టిన ఓ భామనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ భామ ఎవరంటే...
'ఊహలు గుసగుసలాడే' చిత్రం ద్వారా తెలుగు తెరపై మెరిసిన రాశిఖన్నా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ సరసన ఈ అమ్మడు 'బెంగాల్ టైగర్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో రవితేజ చేయబోయే చిత్రంలోనూ రాశిఖన్నానే నాయికగా తీసుకున్నారు. లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) 'అదుర్స్'కి ఓ నిర్మాతగా వ్యవహరించిన వల్లభనేని వంశీమోహన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
రాశిఖన్నా ఖాతాలో ఈ సినిమానే కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో కూడా రాశిఖన్నానే హీరోయిన్ గా నటించనుంది. సో.. మొత్తం మీద రాశిఖన్నా భారీ ప్రాజెక్ట్ కి సైన్ చేసిందని చెప్పొచ్చు.