'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో 'తోబ తోబ..' అంటూ పవన్ కళ్యాణ్ తో కలిసి ఐటమ్ పాటకు చిందేసిన లక్ష్మీరాయ్, 'ఖైదీ నెం.150' చిత్రంలో 'రత్తాలు...' సాంగ్ కి మెగాస్టార్ చిరంజీవితో కలిసి చిందేసింది. ఈ రెండు పాటలు లక్ష్మీరాయ్ కి మరిన్ని ఐటమ్ పాటలు చేసే అవకాశాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజా వార్తల ప్రకారం లక్ష్మీరాయ్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ను పడిందని తెలుస్తోంది.
బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐటమ్ పాట కోసం లక్ష్మీరాయ్ ని తీసుకుందామని అంటున్నాడట ఎన్టీఆర్. ఆల్ రెడీ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసిన లక్ష్మీరాయ్ అంటే డైరెక్టర్ బాబి కూడా సుముఖంగానే ఉన్నాడట. కాబట్టి ఎన్టీఆర్ తో ఐటమ్ పాటకు లక్ష్మీరాయ్ చిందేయడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఇదే కనుక జరిగితే లక్ష్మీరాయ్ మరిన్ని ఐటమ్ పాటలు చేసే అవకాశముందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట. కాబట్టి ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించే అవకాశం ఎవరెవరికి దక్కుతుందో వేచి చూద్దాం.