15 యేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి క్రియేట్ చేసిన ఓ రికార్డ్ ని ఎవ్వర బ్రేక్ చేయలేకపోయారు. ఎన్నో కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్న 'బాహుబలి' సైతం ఈ రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను 'ఖైదీ నెం. 150' తో చిరంజీవి బ్రేక్ చేయడం విశేషం. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటీ అనే వివరాల్లోకి వెళితే....
2002లో విడుదలైన 'ఇంద్ర' చిత్రం తుని (ఈస్ట్ గోదావరి) లో 18 లక్షలు వసూళ్లు కురిపించి ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. దీని తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా ఈ రికార్డ్ ను బ్రేక్ చేయలేదు. ఇప్పుడు ఖైదీ నెం. 150 చిత్రం ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది. విడుదలైన 11వ రోజుకు ఈ చిత్రం 18.74లక్షలు వసూళ్లను దాటి 20లక్షలు సాధించే దిశగా దూసుకెళుతోంది. సో... చిరు రికార్డ్ ను చిరునే బ్రేక్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ రికార్డ్ పట్ల మెగాభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉంటే...
మరో నెల రోజులలోపే చిరు 151వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. చిరు వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది మెగాభిమానులను చాలా సంతోషపెట్టే విషయం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.