మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నాడు. 'ధృవ' చిత్రం రిజల్ట్ రాంచరణ్ ని ఫుల్ ఖుషీ చేస్తే, నిర్మాతగా తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ చిత్రం 'ఖైదీ నెం.150' నిర్మించే పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకుని సక్సెస్ అయ్యాడు. ఇక తన తదుపరి సినిమాతో బిజీ అయిపోవాలనుకుంటున్నాడట. సుకుమార్ దర్శకత్వంలోనే రాంచరణ్ తదుపరి సినిమా రూపొందనుంది. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. జనవరి 30న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపి, వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే...
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్నఈ చిత్రంలో రాంచరణ్ చెవిడివాడిగా నటించబోతున్నాడట. కాగా ఈ సినిమా కోసం అనుపమపరమేశ్వర్ ని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారు. కానీ రాంచరణ్ సరసన అనుపమ అంతగా సూట్ అవ్వలేదట. దాంతో అనుపమను తీసుకోలేదు. తాజా వార్తల ప్రకారం ఇటీవల డివోర్స్ తీసుకుని హీరోయిన్ గా మళ్లీ సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న అమలాపాల్ ని రాంచరణ్ కోసం రంగంలోకి దింపాలనుకుంటున్నారట. రాంచరణ్ 'నాయక్' చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు రెండోసారి రాంచరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం అమలాపాల్ కి దక్కనుంది. నిజంగా ఈ అవకాశం అమలాపాల్ ని వరిస్తే, అమ్మడికి బంపర్ ఆఫర్ దక్కినట్టేనని చెప్పొచ్చు.