సమ్మర్ కానుకగా మరో రెండు రోజుల్లో శుక్రవారం (24.3.201) నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం ధియేటర్స్ కి వస్తోంది. ఈ సినిమా కోసం మెగాభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్స్, టీజర్స్ కి భారీ స్పందన లభించింది. బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో చిత్రం యూనిట్ ఉంది. కాగా ఈ సినిమా క్రేజ్ ని 'కేశవ' వాడుకోబోతున్నాడు.
నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కేశవ'. 'స్వామి రారా' తో హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ 'కేశవ' తో మరో హిట్ ని తమ ఖాతాలో వేసుకుంటామనే ధీమాతో ఉన్నారు. కాగా 'కేశవ' టీజర్ ని 'కాటమరాయుడు' చిత్రం ఇంటర్వెల్ లో స్ర్కీనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసారు. 'కేశవ' టీజర్ కి సోషల్ మీడియాలో చక్కటి స్పందన లభిస్తోంది. ఈ నేపధ్యంలో 'కాటమరాయుడు' చిత్రంతో పాటు 'కేశవ' టీజర్ ని స్ర్కీనింగ్ చేస్తే ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరుగుతుంది. 'కేశవ' టీజర్ ఇంప్రెస్ చేస్తే, ఆడియన్స్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంటారు. ఇది సినిమా వసూళ్లపైన ప్రభావం చూపుతుంది. అందుకే 'కాటమరాయుడు' తో 'కేశవ' టీజర్ ని స్ర్కీనింగ్ చేస్తున్నారు. మరి 'కేశవ' టీజర్ ఏ మేరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో వేచి చూద్దాం.