'బ్రూస్ లీ' లాంటి ఫ్లాప్ చిత్రం చేసిన డైరెక్టర్ శ్రీను వైట్ల ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో 'మిస్టర్' టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. కాగా డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ఓ వార్త వినబడుతోంది. అదేంటంటే...
శ్రీను వైట్ల కెరియర్ లోనే భారీ హిట్ చిత్రం 'దూకుడు'. ఈ చిత్రం శ్రీను వైట్ల కెరియర్ ని మార్చేసింది. ఈ సినిమా తర్వాత 12కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు శ్రీను వైట్ల. అయితే 'బ్రూస్ లీ' చిత్రం ఫ్లాప్ తో శ్రీను వైట్ల కెరియర్ డైలమాలో పడిపోయింది. హీరోలెవ్వరూ దగ్గరకు రానివ్వలేదు. ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ తో సినిమా చేసే అవకాశం శ్రీను వైట్లకు వచ్చింది. దాంతో వరుణ్ తేజ్ తో చేస్తున్న సినిమాకి పారితోషికం వద్దని చెప్పాడట శ్రీను వైట్ల. సినిమా విడుదలైన తర్వాత చూసుకుందామని నిర్మాతల దగ్గర చెప్పేసాడట. పారితోషికం విషయంలో కాంప్రమైజ్ అయ్యి వరుణ్ తేజ్ తో మంచి హిట్ కొట్టి తన సత్తా చాటుకోవాలనే శ్రీను వైట్ల ఇలా డిసైడ్ అయ్యుంటాడు. పారితోషికం తీసుకోకుండా, బడ్జెట్ పెంచకుండా సినిమా చేస్తే నిర్మాతకు భారీ లాభాలను చూపించవచ్చు. అందుకే సినిమా విడుదల తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పాడట శ్రీను వైట్ల. సినిమా హిట్ అయితే, ఆ తర్వాత స్టార్ హీరోలతో అవకాశాలు కొట్టేసి భారీ పారితోషికం తీసుకోవచ్చని ఫిక్స్ అయ్యాడట. సో... శ్రీను వైట్ల మంచి కసి మీద ఉన్నాడని చెప్పొచ్చు. ఈ కసితో మంచి హిట్ ని తన ఖాతాలో పడేలా చేసుకుంటాడని కూడా ఫిక్స్ అయిపోవచ్చు.