నిన్న రాత్రి నుంచి త్రిష గురించి ఓ వార్త ప్రచారం అవుతోంది. తను హాస్పటల్లో అడ్మిట్ అయ్యిందని, త్రిష కు పుడ్ పాయిజన్ అయ్యిందని, హైదరాబాద్ లో హాస్పటల్లో అడ్మిట్ అయ్యిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలను త్రిష తల్లి ఉమాకృష్ణన్ ఖండించారు. త్రిష సేఫ్ గా ఉందని, ఆరోగ్యంగా ఉందని ఆమె తెలిపారు. 'సదురంగ వేట్టై' సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటూ మలేషియాలో ఉందని, త్రిష గురించి ప్రచారమవుతున్న వార్తలు నిజంకాదని ఆమె తల్లి చెప్పారు. దాంతో త్రిష అభిమానులు రిలాక్స్ అయిపోయారు. మరి త్రిష ఆరోగ్యం గురించి ఎందుకు తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయో తెలియడంలేదు. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది త్రిష. మోహిని, గర్ఝనై తదితర చిత్రాలు చేస్తోంది త్రిష.