మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ సాత్వంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకుని ఓ స్ర్కిఫ్ట్ రెడీ చేసారు. ఈ స్ర్కిఫ్ట్ తోనే చిరు 151వ చిత్రం రూపొందనుంది. రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 'ఖైదీ నెంబర్ 150' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలందించాడు. కానీ చిరు 151వ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం దేవికి దక్కలేదని సమాచారమ్. 'ధృవ' చిత్రానికి సంగీతమందించిన హిప్ హాప్ తమిళా కి ఈ అవకాశం దక్కిందని తెలుస్తోంది. 'ధృవ' పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. ఈ నేపధ్యంలో రాంచరణ్ ఓటు హిప్ హాప్ తమిళాకి పడినట్టు తెలుస్తోంది. రాంచరణ్ ఈ సంగీత దర్శకుడికి ఓటేసాడు. చిరు కూడా ఈ సంగీత దర్శకుడిని తీసుకోవడానికి అంగీకరిస్తే హిప్ హాప్ తమిళాకి మెగాస్టార్ చిరు చిత్రం చేసే అవకాశం దక్కుతుంది. మరి చిరు కూడా ఈ సంగీత దర్శకుడికి ఓటేస్తారా... చూద్దాం...!