బెంగాల్ టైగర్ చిత్రం తర్వాత మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రం కమిట్ అవ్వడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. భారీగా పారితోషికం డిమాండ్ చేస్తూ, మునగచెట్టు ఎక్కి కూర్చోవడంతో రెండు, మూడు ప్రాజెక్ట్ లు అతని చేజారాయి. అయితే ఈ విషయం గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో రవితేజ వెంటవెంటనే రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. 5కోట్ల పారితోషికం, లాభాల్లో 25శాతం వాటా తీసుకోవడానికి అంగీకరించడంతో రవితేజతో సినిమా నిర్మించడానికి దిల్ రాజు ముందుకు రావడం, ఈ ఒప్పందం ప్రకారమే 'రాజా ది గ్రేట్' చిత్రం సెట్స్ పైకి వెళ్లడం జరిగింది. మరో సినిమా 'టచ్ చేసి చూడు' కూడా ఈ బేసిస్ మీదే వర్కవుట్ అయ్యిందట. ఇలా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రవితేజ తాజా వార్తల ప్రకారం మరో సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
జయం రవి, హన్సిక జంటగా తమిళంలో రూపొందిన చిత్రం 'బోగన్'. ఈ సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిన్నటితో 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ లో నటించడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్. తమిళ్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించబోతున్నారట. తమిళంలో అరవింద్ స్వామి పోషించిన కీలక పాత్ర కోసం ఓ పాపులర్ హీరోని తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నారట డైరెక్టర్. ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని ఫైనలైజ్ అయిన తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారమ్.