యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'జై లవకుశ' టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ప్రస్తుతం లవకుమార్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హంసా నందిని ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ సిలికాన్ మాస్క్ వాడబోతున్నాడు. పైనున్నది ఆ సిలికాన్ మాస్కే. భయంకరంగా ఉన్న ఈ మాస్క్ ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించబోతున్న నెగటివ్ షేడ్ క్యారెక్టర్ కోసం వాడబోతున్నారని సమాచారమ్. 'జై లవకుశ' చిత్రం స్టోరీ చాలా పవర్ ఫుల్ గా, డిఫరెంట్ గా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫీసర్ గా లవకుమార్ లుక్ అదిరింది. ఇప్పుడు ఈ సిలికాన్ మాస్క్ తో గెటప్ సంచలనం సృష్టిస్తోంది. సో... ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాతో సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.