యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పెళ్లి ఎపిసోడ్ ఉందట. ఈ పెళ్లి ఎపిసోడ్ ని హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ లో చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్, రాశిఖన్నా పాల్గొనగా ఈ పెళ్లి సీన్ చిత్రీకరణ జరుగుతోందట. ఇదిలా ఉంటే...
ఇక్కడ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మే లో ఓ భారీ షెడ్యూల్ ని గుజరాత్ లో ప్లాన్ చేసారని వినికిడి. ఆ షెడ్యూల్ లో ఎక్కువ శాతం షూటింగ్ ని పూర్తి చేయడానికి ప్లాన్ చేసాడట డైరెక్టర్ బాబి. సో.. ఎన్టీఆర్ సహకారంతో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసిన ప్రకారం జరుగుతోందని చెప్పొచ్చు.