యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పెళ్లి ఎపిసోడ్ ని హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ టెంపుల్ లో చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్, రాశిఖన్నా పాల్గొనగా ఈ పెళ్లి సీన్ చిత్రీకరణ జరుగుతోందట. దేవిశ్రీ ప్రసాద్ ఆల్ రెడీ ఈ సినిమాకి ట్యూన్స్ సమకూర్చుతుంటే, లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ఓ పాటకు లిరిక్ రాసేసారు. నావల్ కాన్సెఫ్ట్.. అందరికీ నచ్చే విధంగా ఈ పాటకు లిరిక్ కుదరింది అని రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఇదిలా ఉంటే...
ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రం యూనిట్ భారీ ప్లాన్స్ వేస్తోందని సమాచారమ్. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆ రోజున 'జై లవ కుశ' ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ లుక్ ని అద్భుతంగా తీర్చిదిద్దాలని డైరెక్టర్ బాబి అండ్ టీమ్ కృషి చేస్తోందట. ఆగస్ట్ లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.