మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల 'మిస్టర్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది. ప్రస్తుతం తదుపరి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే పనిలో చిత్రం యూనిట్ ఉందట.
ముందుగా ఈ సినిమా కోసం మెహ్రీన్ ని హీరోయిన్ గా తీసుకుందామనుకున్నారు. కానీ ఎందుకనో ఆమెను వద్దనుకుని రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేసారట. డైరెక్టర్ వెంకీ చెప్పిన స్టోరీ లైన్, హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం రకుల్ కి బాగా నచ్చిందట. అయితే పారితోషికం విషయంలో రకుల్ శాటిస్ ఫై అవ్వక, ఈ సినిమా చేయడానికి నిరాకరించిందట. ఇప్పుడు రకుల్ ని రాశిఖన్నా రీప్లేస్ చేసిందని సమాచారమ్.
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో 'సుప్రీం' సినిమా కోసం జత కట్టింది రాశిఖన్నా. తాజాగా మరో మెగా హీరోతో రొమాన్స్ కి అంగీకరించింది. ఆల్ రెడీ ఎన్టీఆర్ తో 'జై లవ కుశ', రవితేజతో 'టచ్ చేసి చూడు' చిత్రాలు చేస్తోంది రాశిఖన్నా. సో... మూడు సినిమాలతో రాశిఖన్నా కెరియర్ ఊపందుకుందని చెప్పొచ్చు.