ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం 'స్పైడర్' తో బిజీగా ఉన్నాడు. 'స్పైడర్' చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివ సినిమాతో బిజీ అయిపోదామని ప్లాన్ వేసుకున్నాడు మహేష్ బాబు. అయితే 'స్పైడర్' షూటింగ్ పూర్తవ్వకపోవడంతో కొరటాల శివతో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్ లేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగడంలేదు. కొరటాల, మహేష్ సినిమా 'భరత్ అనే నేను' కి ముహూర్తం ఖరారయ్యింది,
మే 18న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ఆరంభంకానుంది. ఈ యేడాది చివరికల్లా షూటింగ్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే యేడాది సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మోస్ట్ లీ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారమ్. కియారా అద్వాని ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయంకానుంది.