మెగా ఫ్యాన్స్ వాట్సఫ్ లో ఓ మెసేజ్ ని వైరల్ గా స్ర్పెడ్ చేస్తున్నారు. ఈ మెసేజ్ 'బాహుబలి 2' కి సంబంధించినది కావడంతో అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎందుకు మెగా ఫ్యాన్స్ 'బాహుబలి 2' కి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు... సినిమా చూడొద్దని ఎందుకు చెబుతున్నారు వివరాల్లోకి వెళితే...
'బాహుబలి 2' చిత్రం ప్రీమియర్, బెనిఫిట్ షోలు స్ర్కీనింగ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం మెగాభిమాలను విపరీతమైన ఆగ్రహానికి గురి చేస్తోంది. 'ఖైదీ నెం.150', 'కాటమరాయుడు' చిత్రాలకు సంబంధించి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. 'బాహుబలి 2' చిత్రానికి టిక్కెట్స్ రేట్ పెంచడానికి కూడా గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వడంతో... కొంతమంది వ్యక్తులు, ఓ సినిమాపైన ప్రేమతో ప్రభుత్వాలు ఇలా పాజిటివ్ గా స్పందించడం ఏ మాత్రం కరెక్ట్ కాదని మెగాభిమానులు అంటున్నారు. అందుకే 'బాహుబలి 2' విడుదలైన తర్వాత ఓ వారం వరకూ సినిమా చూడొద్దని తమ ఫ్యాన్స్ గ్రూపులకు వాట్సఫ్ లో ఓ మెసేజ్ ని మెగాభిమానులు స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఈ మెసేజ్ సినిమా వసూళ్లపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా... వేచి చూడాల్సిందే.