మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల 'మిస్టర్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది. ప్రస్తుతం తదుపరి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది.
ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ని సంగీతదర్శకుడిగా తీసుకున్నారట. అయితే ఈ మధ్య కమిట్ అయిన కొన్ని ప్రాజెక్ట్స్ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవ్వడంతో వరుణ్ తేజ్ చిత్రానికి సంగీతమందించడం కష్టమవుతుందని భావించాడట దేవిశ్రీప్రసాద్. ఇదే విషయాన్ని దర్శక, నిర్మాతల దగ్గర చెప్పి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు దేవి స్థానంలో తమన్ ని తీసుకున్నారు. తమన్ ఆల్ రెడీ ట్యూన్స్ కంపోజ్ చేయడం మొదలెట్టేసాడు. నిన్నటి నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ఆరంభమయ్యాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటించనుంది.