మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్స్ జాబితాలో బోయపాటి శ్రీను పేరు ముందు వరసలో ఉంటుంది. స్టోరీలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి ఆ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెంచేస్తాడు. ప్రస్తుతం నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తోంటే, క్యాథరీన్ థెరిస్సా ఐటమ్ సాంగ్ చేసింది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా బిజినెస్ చాలా క్రేజీగా జరుగుతోందట.
ఈ సినిమా సీడెడ్ హక్కుల కోసం 7.2 కోట్లు ఆఫర్ రావడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. 8 నుంచి 9 కోట్లు ఇచ్చి హక్కులు దక్కించుకుని, పెద్ద హీరోల సినిమాలను సీడెడ్ లో పంపిణీ చేస్తుంటారు. అలాంటిది 3వ సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి ఈ ఆఫర్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి కారణం బోయపాటి శ్రీను. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను తన సినిమాల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఓ స్టార్ హీరో సినిమాకి ఫాలో అయ్యే స్ట్రాటజీనే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి కూడా ఫాలో అవ్వడంతో బిజినెస్ సర్కిల్ లోఈ సినిమాపై క్రేజ్ నెలకొంది. ఈ నేపధ్యంలోనే సీడెడ్ హక్కుల నిమిత్తం 7.2 కోట్లు ఆఫర్ ఈ సినిమా రాబట్టగలిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమాకి ఇంతే క్రేజ్ నెలకొందట. సో.. ఈ సినిమా బిజినెస్ భారీగా జరగడం ఖాయం, బోయపాటి సినిమా కాబట్టి, బి, సి సెంటర్స్ లో ఈ సినిమా భారీ వసూళ్లను కూడా చవిచూసే అవకాశముంది. ఇక హిట్ టాక్ వస్తే, వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యే అవకాశముంది.