ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రానికి సంబంధించిన క్లయిమ్యాక్స్ చిత్రీకరణ చెన్నయ్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం దాదాపు 130కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
కాగా ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం మురుగదాస్ తీసుకున్న నిర్ణయం వల్ల సినిమా రిలీజ్ విషయంలో కూడా మార్పులు జరిగిన విషయం తెలిసిందే. 'బాహుబలి' కి వర్క్ చేసిన గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతోంది. విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ కమలకన్నన్ రంగంలోకి దిగారు. రష్యన్ బేస్డ్ విఎఫ్ ఎక్స్ స్టూడియోలో కమలకన్నన్ ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ కోసం వర్క్ చేస్తున్నారట. క్లయిమ్యాక్స్ చాలా భారీగా, థ్రిల్లింగ్ గా ఉండబోతోందని సమాచారమ్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదలకాబోతోంది. యస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.