యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై 'జై లవ కుశ' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో అన్నయ్య కళ్యాణ్ రామ్ భారీ లాభాలను చవిచూడాలని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. ఇందుకోసం సినిమా బడ్జెట్ విషయంలో పక్కాగా ఉన్నాడట. ఏ మాత్రం బడ్జెట్ పెరగకూడదని, షూటింగ్ రోజులు తగ్గితే ఆటోమేటిక్ గా బడ్జెట్ తగ్గుతుందని భావిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్ ని ప్లాన్ చేసిన ప్రకారం పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే..
ఈ సినిమా ఓవర్ సీస్ హక్కుల నిమిత్తం 14కోట్లు డిమాండ్ చేస్తున్నాడట నందమూరి కళ్యాణ్ రామ్. ఆల్ రెడీ ఓవర్ సీస్ పంపిణీ హక్కుల నిమిత్తం చర్చలు జరుగుతున్నాయని, ఒకటి, రెండు రోజుల్లో డీల్ పూర్తవుతుందని సమాచారమ్. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులను జెమిని చానెల్ 14కోట్లు ఇచ్చి మరీ దక్కించుకుందని తెలుస్తోంది. టేబుల్ ప్రాఫిట్ తో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో.. అన్నయ్యకు తమ్ముడు ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాతో భారీ గిఫ్ట్ నే ఇస్తున్నాడని చెప్పొచ్చు.