మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి మెగా పవర్ స్టార్ రాంచరణ్ సమాయత్తమవుతున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాల ఇన్సిఫిరేషన్ తో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ని భారీ ఎత్తున నిర్మించి విడుదల చేయాలని, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి గుర్తింపు తీసుకురావాలనే పట్టుదలతో మెగా కుటుంబం ఉందట. విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్సయ్యారట.
కాగా తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని ఓ కీలక పాత్రలో నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా రాంచరణ్ రంగంలోకి దిగి బిగ్ బి కి ఈ సినిమా గురించి, ఈ సినిమాలో ఆయన చేయాల్పిన పాత్ర గురించి వివరించి చెప్పాడట. అన్నీ విన్న అమితాబ్ బచ్చన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదటగానీ, సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని కుదిరి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తే.. ఈ ప్రాజెక్ట్ కి ఏ రేంజ్ లో క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాంచరణ్ మాత్రం ఎలాగైనా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని ఒప్పించాలనే టార్గెట్ తో ఉన్నాడట. మరి ఫైనల్ గా సాధిస్తాడా వేచి చూద్దాం. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజునాడు ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపి సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట.