'ఆగడు', 'బ్రూస్ లీ', 'మిస్టర్' చిత్రాలతో వరుసగా ఫ్లాప్స్ ని చవిచూసాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. దాంతో అతని కెరియర్ డైలమాలో పడిపోయింది. తదుపరి సినిమా అవకాశం ఎలా వస్తుంది.. ఏ హీరో అవకాశం ఇస్తాడు.. ఏ నిర్మాత శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయడానికి ముందుకు వస్తాడనే చర్చ ఫిల్మ్ నగర్ లో జరుగుతోంది. ఇవన్ని ప్రశ్నలే అయినప్పటికీ శ్రీను వైట్ల మాత్రం ఓ టార్గెట్ తో ఉన్నాడని తెలుస్తోంది.
ప్తస్తుతం శ్రీను వైట్ల కథలు రెడీ చేసుకునే పనిలో ఉన్నాడట. కామ్ గా తన టీమ్ తో కలిసి కథా చర్చలో పాల్గొంటున్నాడట. కథ రెడీ అయిన తర్వాత సందీప్ కిషన్ ని కలిసి కథ చెప్పి, అతనితో ప్రాజెక్ట్ ఒకే అయ్యేలా చేసుకోవాలనే టార్గెట్ తో ఉన్నాడట. సందీప్ కిషన్ తో ప్రాజెక్ట్ ఒకే అయితే నిర్మించడానికి ఓ నిర్మాత కూడా రెడీగా ఉన్నాడని సమాచారమ్. అందుకే ప్రస్తుతం ఫోకస్ అంతా కథపైన పెట్టాడట శ్రీను వైట్ల. ఒకటి, రెండు నెలల్లో ఓ కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టేయాలనే పట్టుదలతో శ్రీను వైట్ల ఉన్నాడని తెలుస్తోంది,