ముద్దపప్పు, ఆవకాయ్ వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకున్న మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా పరిచయం అయిన 'ఒక మనస్సు' చిత్రంతో మాత్రం కమర్షియల్ సక్సెస్ ని అందుకోలేకపోయింది. కానీ నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా కమిట్ అవ్వకపోవడంతో నిహారిక ఇక సినిమాలు చేయదని అందరూ భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
నారా రోహిత్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో నిహారిక హీరోయిన్ గా నటించనుందనేది ఆ వార్త. సావిత్రి ఫేం పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడట. నారా రోహిత్, నిహారిక కాంబినేషన్ ని వర్కవుట్ చేయడంలో పవన్ సాధినేని విజయం సాధించాడని, స్టోరీ లైన్ విన్న ఈ ఇద్దరూ తెర పంచుకోవడానికి అంగీకరించారని సమాచారమ్. ఇదే కనుక నిజమైతే మెగాభిమానులు ఈ వార్తను ఎలా స్వీకరిస్తారో వేచి చూడాల్సిందే. ఏదేమైనా నిహారిక పి.ఆర్ టీమ్ గానీ, రోహిత్ పి.ఆర్ టీమ్ గానీ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. సో.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందే.