మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెం.150' కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వి.వి.వినాయక్ తదుపరి చిత్రం ఇంకా ఆరంభమవ్వలేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేసాయి. అయితే ఈ కాంబినేషన్ ప్రాజెక్ట సెట్ అవ్వలేదుగానీ, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడనేది తాజా సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...
సాయిధరమ్ తేజ్ కోసం ఓ స్టోరీ లైన్ ని ఫిక్స్ చేసాడట వినాయక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ఆల్ రెడీ లావణ్యతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అల్లు శిరీష్ సరసన 'శ్రీరస్తు శుభమస్తు', వరుణ్ తేజ్ సరసర 'మిస్టర్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లావణ్య మెగా మేనల్లుడితో కూడా రొమాన్స్ చేయబోతోంది. సో... అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని ఊహించవచ్చు. సాయిధరమ్ తేజ్ కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.