'శతమానం భవతి' తో భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ వేగ్నేశ సతీష్ తో దిల్ రాజు 'శ్రీనివాస కళ్యాణం' టైటిల్ తో ఈ సినిమా నిర్మించడానికి సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేసాయి. రాంచరణ్ తో నటింపజేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే 'శ్రీనివాస కళ్యాణం' కోసం వేరే హీరోని తీసుకుని రాంచరణ్ తో భారీ బడ్జెట్ తో, టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యినట్టు వార్తలు రావడంతో 'శ్రీనివాస కళ్యాణం' లో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందా అనుకున్నారు.
తాజా వార్తల ప్రకారం ఈ అవకాశం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి దక్కిందని తెలుస్తోంది. సతీష్ వేగ్నేశ ఆల్ రెడీ స్ర్కిఫ్ట్ రెడీ చేసాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. హీరోయిన్, ఇతర సాంకేతిక వర్గాన్ని ఫైనలైజ్ చేసే పనిలో చిత్రం యూనిట్ ఉందని తెలుస్తోంది.