డిస్ట్రిబ్యూటర్ గా నైజాం ఏరియాలో దిల్ రాజుకి ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా పెద్ద సినిమా హక్కులను తీసుకోవడంలేదు. ఈ మధ్య కాలంలో నైజాం ఏరియాలో దిల్ రాజు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సినిమా హక్కులను కైవసం చేసుకున్నాడు.
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం ఏరియా థియేట్రికల్ హక్కులను 25కోట్లుకు దిల్ రాజు దక్కించుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది, 'బాహుబలి' తర్వాత ఇంత భారీ ఆఫర్ ని దక్కించుకున్న సినిమా ఇదే అవుతుంది. మహేష్ బాబు 'శ్రీమంతుడు' చిత్రం నైజాంలో 20కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు 25కోట్లుకు దిల్ రాజు 'స్పైడర్' హక్కులను దక్కించుకున్నాడు కాబట్టి, ఏ మేరకు లాభాలను చవిచూసే అవకాశముందో వేచి చూడాల్సిందే.