ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది మహేష్ బాబుకి 25వ చిత్రం. వచ్చే యేడాది జనవరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది తెలుస్తోంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. 'ఒక లైలా కోసం' చిత్రం ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె ఆ తర్వాత 'ముకుంద', 'దువ్వాడ జగన్నాధమ్' చిత్రాలు చేసింది. ఈ మూడు సినిమాలు ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఆ ఎఫెక్ట్ పూజా పై పడింది. ఆమెకు ఐరన్ లెగ్ ముద్ర వేసేసారు. ఈ ముద్ర ఏ హీరోయిన్ ని అయినా తెగ బాధపెడుతుంది. అయితే ఇలాంటి ముద్ర పడినప్పటికీ, అమ్మడికి ఓ బంపర్ తగిలిందని తెలుస్తోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డెని నటింపజేయాలనే ఆలోచనలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఉన్నాడట. ఈ చిత్రాన్ని నిర్మించనున్న దిల్ రాజు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే పూజా హెగ్డె కి బంపర్ ఆఫర్ తగిలిన్టటేనని చెప్పొచ్చు.