బిగ్ బాస్ గేమ్ షో తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ షో కి సంబంధించి ఓ వార్త ప్రచారం అవుతోంది. ఈ గేమ్ షోలో పార్టిసిపెంట్ గా వ్యవహరిస్తున్న ఇద్దరిని స్వయంగా ఎన్టీఆర్ రికమండ్ చేసాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ లిస్ట్ ను చాలా గోప్యంగా ఉంచారు. ఎన్టీఆర్ కి కూడా ఓ వారం ముందే లిస్ట్ అందిందట. లిస్ట్ చూసిన ఎన్టీఆర్ పార్టిసిపెంట్ లిస్ట్ లో ధనరాజ్, సంపూర్నేష్ బాబులను ఉండేలా చూసుకోమని చెప్పాడట. దాంతోఈ ఇద్దరికీ 'బిగ్ బాస్' గేమ్ షోలో పాల్గొనే అవకాశం దక్కిందని సమాచారమ్. ఈ ఇద్దరూ ఉండటం వల్ల 'బిగ్ బాస్' షో ఉత్సాహంగా సాగుతుందని చెప్పాడట ఎన్టీఆర్. వారి సెటైర్లు, ముచ్చట్లు ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచెత్తుతాయని కూడా ఎన్టీఆర్ భావిస్తున్నాడట. మరి ఎన్టీఆర్ రికమండ్ చేసిన ఈ ఇద్దరూ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తారో వేచి చూద్దాం.