హైదరాబాద్ లోని హోటల్ షెరటాన్ లో కొరటాల శివ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే పర్సనల్ పనులతో కాదు. సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని హోటల్ షెరటాన్ లో జరుగుతోంది.
సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ హోటల్లో చిత్రీకరిస్తున్నారట కొరటాల. మరి కొన్ని రోజుల పాటు ఈ కీలక సన్నివేశాల చిత్రీకరణతోనే బిజీగా ఉండబోతున్నారని తెలుస్తోంది. అయితే హోటల్ లోనే ఈ చిత్రీకరణ సాగనుందా లేక లొకేషన్ షిఫ్ట్ అవుతారా అని తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్పారు.