ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందీ చిత్రం. కాగా కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను బల్గేరియాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు డైరెక్టర్ త్రివిక్రమ్.
బల్గేరియా లో 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ షూటింగ్ జరిగింది. అక్కడ లొకేషన్స్ చాలా బాగుంటాయట, అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ బల్గేరియాలో పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసారని వినికిడి. ఈ రోజు ఈ చిత్రం యూనిట్ బల్గేరియా బయలుదేరి వెళ్లింది. పవన్ కళ్యాణ్ కూడా వెళ్లిపోయాడు. దాదాపు నెల రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. రివేంజ్ డ్రామాతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజువల్ గా చాలా లావిష్ గా ఉంటుందట. కీర్తి సురేష్, అనూఇమ్మాన్యువేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు.