'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూసారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాల తర్వాత మళ్లీ బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందాని నందమూరి అభిమానులతో పాటు సినీప్రియులు ఎదురుచూస్తున్నారు. కాగా తాజా వార్తల ప్రకారం వీరి కాంబినేషన్ సినిమాకి రంగం సిద్ధమవుతోందని ఫిల్మ్ నగర్ టాక్.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో 'రంగస్థలం' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్, నాగచైతన్యతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఇదే సంస్థపై బాలయ్య, బోయపాటి కాంబినేషన్ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఆల్ రెడీ బాలయ్య, బోయపాటి శ్రీను ఓ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయట. ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడానికి సిద్ధమవుతోందట. అన్నీ కుదిరితే వచ్చే యేడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం 'పైసా వసూలు' చిత్రం పూర్తి చేసిన బాలయ్య, వెంటనే కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారమ్.