మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెం.150' కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వి.వి.వినాయక్ తదుపరి చిత్రం ఇంకా ఆరంభమవ్వలేదు. అయితే మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు వినాయక్.
రైటర్ ఆకుల శివ అందించిన స్టోరీ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి 'దుర్గ' టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ టైటిల్ ని ఖరారు చేయలేదని వినాయక్ ఓ సందర్భంలో చెప్పేసాడు. ఆకుల శివ కథ అందిస్తే, స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ స్ర్కీన్ ప్లే, డైలాగులు సమకూర్చుతున్నారట.
'తిక్క', 'విన్నర్' చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ కెరియర్ డైలమాలో పడిపోయింది. ఇప్పుడు వినాయక్ ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసాడు కాబట్టి, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోల లీగ్ లొ స్థానం సంపాదించుకుని, సక్సెప్ ట్రాక్ ఎక్కుతాడేమో వేచి చూడాల్సిందే.