యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన జై టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. త్వరలో లవ, కుశ టీజర్స్ ని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే...
ఈ చిత్రం బిజినెస్ క్రేజీగా జరుగుతోందనే వార్తలు ఉన్నాయి. శాటిలైట్ హక్కులను జెమిని చానెల్ 14కోట్లు ఇచ్చి మరీ దక్కించుకుందని వినికిడి. తాజాగా ఈ చిత్రం నెల్లూరు, సీడెడ్ పంపిణీ హక్కులను పద్మావతి ఫిలింస్ కైవసం చేసుకుందని సమాచారమ్. ఈ హక్కుల కోసం పద్మావతి ఫిలింస్ భారీగానే చెల్లించిందట. మొత్తం మీద బిజినెస్ పరంగా సత్తా చాటుకుంటున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ'... విడుదలైన తర్వాత వసూళ్ల పరంగా కూడా తన సత్తా చాటుకుంటుందని ఊహించవచ్చు.