'ఫిదా' చిత్రంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఫిదా చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ వైపు ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన తదుపరి సినిమాతో బిజీ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.
వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనుంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆల్ రెడీ జరిగిపోయాయి. కాగా రేపట్నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది. ఒక లవ్స్టోరీలోని పదేళ్ళ జర్నీతో ఈ సినిమా తెరకెక్కనుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించనుంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. సో... 'ఫిదా' రిలీజ్ అయ్యి రెండు రోజులే అవుతోంది. అయినా సరే పెద్ద గ్యాప్ తీసుకోకుండానే తదుపరి సినిమాతో బిజీ అవ్వబోతున్నాడు వరుణ్ తేజ్.